Home » » ఆదిపర్వము - ప్రథమాశ్వాసము

ఆదిపర్వము - ప్రథమాశ్వాసము

 



ఓం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.

 

ముల్లోకాల్లో తొలి పూజను అందుకునే ఆది దేవుడు వినాయకుడు పని మొదలు పెట్టినా ముందుగా వినాయకుడికి భక్తితో నమస్కరించి తొలి పూజ చేస్తే విఘ్నాలు రాకుండా చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తయ్యేలా ఆదిదేవుడు కాపాడుతాడని అందరి నమ్మకం.

 

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు  గణనాధుని ఆశీర్వాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూమహాభారతం మీకు అందినస్తున్నాం .

 

ఆది పర్వం  క్రింది సంస్కృత మంగళ శ్లోకంతో ప్రారంభం అవుతుంది సంస్కృత శ్లోకం తెలుగు సాహిత్యానికే మంగళ శ్లోకం అనవచ్చును.

 

శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాజ్గేషు యే

లోకానాం స్థితి మావహ న్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం

తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వస్సురై

ర్భూయాసుః పురుషోత్తమామ్బుజభవశ్రీకన్ధరా శ్శ్రేయసే.

 తరువాత ఒక వచనంతరువాత  క్రింది ఉత్పలమాలతో ప్రారంభం అవుతుంది.

 

రాజకులైకభూషణుడురాజమనోహరుడన్యరాజతే

జోజయశాలిశౌర్యుడువిశుద్దయశశ్శరదిందు చంద్రికా

రాజితసర్వలోకుడపరాజితభూరిభుజాకృపాణధా

రాజలశాంతశాత్రవపరాగుడు రాజమహేంద్రుడున్నతిన్

 

 ఆదిపర్వంలో నన్నయ తాను ఎందుకు  మహా భారతాన్ని తెలుగు సేయుచున్నాడోఅందుకు ఎవరు తోడ్పడుతున్నారో వివరించాడుఅంతే కాకుండా మహాభారత ప్రశస్తినిఅందులో ఏయే విభాగాలలో  కథాంశం ఉన్నదో కూడా వివరించాడుఇది తరువాతి కవులకుపరిశోధకులకు ఎంతో మార్గదర్శకంగా ఉంది

 

ప్రథమాశ్వాసము:

అవతారికమొదలగున్నవిశమంత పంచకాక్షౌహిణీ సంఖ్యా కథనముఉదంకుడు కుండలాలు తెచ్చి గురుపత్నికిచ్చు కథసర్పయాగముకై ఉద్ధవుడు జనమేజయుడిని ప్రోత్సహించుట మొదలగునవి కలవు

 

ప్రవేశిక :

పాండవ మధ్యముడు అర్జునుడుఅర్జునుడి కుమారుడు అభిమన్యుడుఅభిమన్యుడు కురుంక్షేత్ర యుద్ధంలో మరణించాడుఅభిమన్యఉత్తరల కుమారుడు పరీక్షిత్తుపరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు

జనమేజయుడు మహాయజ్ఞం చేస్తున్న సమయంలో అక్కడకు దేవతల శునకం అయిన సరమ కుమారుడు సారమేయుడు వచ్చి ఆడుకోసాగాడుఅది చూసిన జనమేజయుని కుమారులు  కుక్క పిల్లను కొట్టి తరిమారుసారమేయుడు ఏడుస్తూ తల్లి వద్దకు పోయి  విషయం చెప్పగా సరమ జనమేజయుని వద్దకు వచ్చి జనమేజయా ! నీకుమారులు విచక్షణ కరుణ లేకుండా నా కుమారుడిని కొట్టారురాజా ! యుక్తా యుక్త విచక్షణ లేకుండా మంచి వారికి గాని సాధువులకు గాని అపకారం చేస్తే అనుకోని ఆపదలు వచ్చిపడతాయిఅని పలికి అక్కడి నుడి వెళ్ళిపోయింది

యజ్ఞం పూర్తిచేసి జనమేజయుడు హస్థినాపురం పోయిన తరువాత ఒక రోజు సరమ మాటలు గుర్తుకు వచ్చాయిజరిగిన అపరాధానికి పరిహారం జరపక పోయినట్లైతే సమస్యలు ఎదురు కాగలవని భావించిన జనమేజయుడు తగిన శాంతి చేయడానికి తగిన ముని కొరకు అన్వేషిస్తూ సుతశ్రవణుడు అనే మునిని కలుసుకుని నమస్కరించి మీ కుమారుడైన సోమశ్రవణుడిని నాకు ఋత్విక్కుగా పంపించండి అని ప్రార్ధించాడు

అందుకు సుతశ్రవణుడు అంగీకరించి తన కుమారుడిని జనమేజయుని వద్దకు పంపాడుజనమేజయుడు అతడి సాయంతో అనేక పుణ్యకార్యాలు చేసాడు.

 

అవతారిక :

 

శౌనకుడు నైమశారణ్యంలో సత్రయాగం చూస్తున్న సమయంలో అక్కడకు రోమహర్షుని కుమారుడైన ఉగశ్రవసుడు అను సూతుడు వచ్చాడుసూతుడు తనను తాను మునులకు పరిచయం చేసుకుని తాను పురాణకథలు చెప్పటంలో సిద్ధహస్థుడినని చెప్పాడు

అక్కడ ఉన్న మునులు పుణ్యకథను వినాలని కోరికను ఉగ్రశ్రవసువునకు తెలిపారుఉగ్రశ్రవసువు వారికి ఒక కథ చెప్పటం ప్రారంభించాడుపూర్వం కృష్ణద్వైపాయనుడు అను మహర్షి ఒకటిగా ఉన్న వేదాలను ఋగ్వేదంయజుర్వేదంసామవేదంఅధర్వణవేదం అని నాలుగు భాగాలుగా విభజించాడు

తర్వాత బ్రహ్మదేవుని అనుమతి పొంది అష్టాదశ పురాణాలనుభాగవతకథఅణుధర్మశాస్త్రాలనురాజవంశ చరిత్రలనుఇతిహాసాలు మొదలైన రచనలను చేసాడు

 మహా భారతం గ్రంధాన్ని ధర్మజ్ఞులు ధర్మశాస్త్రమనిఆత్మ జ్ఞానులు వేదాంతమనినీతి కోవిదులు నీతి శాస్త్రమనికవులు మహాకావ్యమనిఇతిహాసికులు ఇతిహాసమనిపౌరాణికులు పురాణమనిలాక్షణికులు సర్వ లక్షణ గ్రంధమని అంటారు

 మహాభారతాన్ని చెప్పుటకు దేవలోకంలో నారదునిపితృలోకంలో దేవలుడినిగరుడగంధర్వయక్షరాక్షస లోకాలలో చెప్పుటకు శుకమహర్షినిమనుష్యలోకంలో వైశంపాయుని నియమించాడువైశంపాయుడు జనమేజయునికి చెప్తుండగా నేను విని అది మీకు చెప్తున్నాను

శమంతక పంచకము :


ఉగ్రశ్రవసుడు చెబుతున్న మహాభారతాన్ని వినుచున్న శౌనకాది మునులు,

శౌనకాది మునులు ఉగ్రశ్రవసువునితో అయ్యా మాకు శమంతక పంచకం గురించి వివరించండిమహా భారత కథకు మూలమేమిటో వివరించండి భీష్మాది కురువీరుల గురించి సవివరంగా వినాలని ఉంది అన్నారుకృతయుగాంతంలో దేవదానవ యుద్ధం జరిగినది

త్రేతాయుగాంతంలో రామరావణ యుద్ధం జరిగినదిద్వారపరయుగాంతంలో పాండవులకు కౌరవులకు యుద్ధం జరిగిందిత్రేతాయుగ ద్వారపర యుగ సంధిలో జమదగ్ని కుమారుడు పరశురామునికి క్షత్రియుల పట్ల ఏర్పడిన వైరం కారణంగా ఇరవై ఒక్కసార్లు భూ ప్రదక్షిణ చేసి క్షత్రియులను చంపి  రక్తంతో ఐదు మడుగులు ఏర్పరిచాడువాటిని శమంతక పంచకం అంటారు శమంతక పంచకంలో పాండవులు కౌరవులు యుద్ధం చేసారు కనుక అది ఇప్పుడు కురుక్షేత్రం అయింది.

అర్జునుని ముని మనుమడైన జనమేజయుడు యజ్ఞం చేస్తున్న ప్రదేశంలో సరమ అనే దేవ శునకం కొడుకు ఆడుకుంటూ ఉండగా జన మేజయుని తమ్ములు శ్రుత సేనుడుభీమ సేనుడుఉగ్ర సేనుడును వారు వచ్చి సారమేయుడిని కొట్టారుసారమేయుడు ఏడుస్తూ తల్లికి చెప్పాడుసరమ జనమేజయునితో నీ తమ్ములు నా కుమారుని అకారణంగా కొట్టారు ఇది అధర్మం

ఇలాంటి పనులు చేసే వారికి ఆపదలు వస్తుంటాయి అని చెప్పినదిజనమేజయుడు దేవశునకం అయిన సరమ పలుకులు విని శాంతి కర్మలు చేయింటానికి సంకల్పించాడుఅందుకు శోమశ్రవుడు అనే మహా మునిని పురోహితునిగా నియమించుకున్నాడు

 

ఉదంకుడి వృత్తాంతం

వ్యాసమహర్షి శిష్యుడైన పైలుడి శిష్యుడు ఉదంకుడుఉదంకుడు అను మునికుమారుడు గురుకులంలో విద్యను అభ్యసించాడుఉదంకుడు గురువులను భక్తితో సేవించి అణిమలఘిమప్రాప్తిప్రాకామ్యంమహిమఈశత్వంవశిత్వంకామనసాయిత అనే అణిమాది అష్టసిద్ధులు వంటి విద్యలను పోందాడుఒకరోజు అతడు తన వయసు మీరి పోయిందని గ్రహించి చితించి గురువుకు చెప్పి బాధ పడగా గురువు అతడిని ఊరడించి తన కహమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చాడు

ఉదంకుడు గురువుకు గురుదక్షిణ ఇవ్వాడానికి సంకల్పించగా గురుపత్ని అతడిని గురుదక్షిణగా పౌష్యుని భార్య కుండలాలు కావాలని అడిగింది. . ఉదంకుడు అందుకు అంగీకరించి పౌష్య మహారాజు వద్దకు బయలుదేరాడుఉదంకుడు గురుదక్షిణగా పౌష్యుని భార్య కుండలాలు తీసుకురావడానికి బయలుదారి వెళుతున్న సమయంలో ఒక దివ్యపురుషుడు కనిపించి అతడిని గోమయం తినమని సూచించాడుఉదంకుడు మారుమాటాడక అలాగే చేసాడు

ఉదంకుడు పౌష్యుని వద్దకు పోయి నేను నా గురుపత్నికి గురుదక్షిణగా మీ భార్య కుండలాలను తెచ్చి ఇస్తానని మాట ఇచ్చానుఅవి నాకు ఇప్పించారంటే నేను పోతాను అని అడిగాడుఉదంకుడు కోరికను మహారాజు మన్నించిన మహారాజు మహాత్మా ! నాభార్య వద్దకు వెళ్ళి ఆమెను అడిగి కుండలాలను తీసుకు వెళ్ళండి అని బదులిచ్చాడు.

ఉదంకుడు అలాగే పౌష్యమహారాణి వద్దకు పోయి అక్కడ ఆమె కనిపించక తిరిగి మహారాజు వద్దకు వచ్చి మహారాజా ! నాకు ఆమెకనిపించ లేదుకనుక మీరు వెళ్ళి తెచ్చి ఇవ్వండిఅన్నాడుమహారాజు ఆమె మహాత్మా ! ఆమె మహా పతివ్రతచాలా పవిత్రురాలుఆమె కనిపించాలంటే శౌచం పాటించాలిఅని చెప్పాడుఉదంకుడు అప్పుడు తాను గామయం తినిన తరువాత స్నానం ఆచరించని విషయం గుర్తుకు తెచ్చుకుని కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనం చేసి తిరిగి వెళ్ళగా అప్పుడు అతడికి పౌష్యా దేవి కనిపించింది

ఆమె ఉదంకుడి కోరిక మీద కుండలములను ఇస్తూ ముని కుమారా !  కుండలములు కొరకు మాయలమారి అయిన తక్షకుడు ఎదురు చూస్తున్నాడునీవు  కుండలములు అతడి కంట బడకుండా జాగ్రత్తగా తీసుకుని పో అని చెప్పింది.


ఉదంకుడు పౌష్యుడు శాపప్రతిశాపాలు ఇచ్చుకొనుట :


కుడలములు తీసుకుని రాజు వద్దకు వెళ్ళగా రాజు ఉదంకుని భోజనం చేసిన తరువాత వెళ్ళమని చెప్పాడురాజు కోరిక మేరకు ఉదంకుడు పౌష్యుని ఇంటిలో భోజనం చేస్తుండగా అన్నంలో ఒక వెంట్రుక వచ్చిందిఅందుకు ఉదంకుడు కోపించి చూడకుండా భోజనం పెట్టినందుకు గుడ్డి వాడివి కమ్మని శపించాడుపౌష్యుడు కోపించి ఇంత చిన్న దోషానికి అంత పెద్ద శిక్షానేను నీకు ప్రతి శాపం ఇస్తున్నానునీవు సంతాన హీనుడవు కమ్ము అన్నాడు. . తన అపరాధం గ్రహించిన ఉదంకుడు మహారాజుతో అయ్యా ! నాకు సంతానం కావాలి కనుక నా శాపాన్ని ఉపసంహరించు అని కోరగా పౌష్యుడు మనసు నవనీతం మాట వజ్రాయుధం ఇది బ్రాహ్మణ స్వభావం

క్షత్రియులకు ఇవి రెండు విపరీతములే కనుక నా శాపం ఉపసంహరించ లేను కనుక నీవు ఉపసంహరించు అన్నాడుఅందుకు ఉదంకుడు కొంతకాలం తరువాత నా శాపం ఉపసంహరింపబడుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు.


తక్షకుడు కుండలములు తస్కరించుట :


అలాగే అని చెప్పి ఉదకుండు సకాలంలో గురుపత్నికి కుండలాలను అందచేయాలని బయలుదేరాడుమార్గమధ్యంలో ఉదకుండు అనుష్టానం చేసుకోవడానికి కుండలాలను ఒక ప్రదాశంలో దాచి స్నానం చేస్తున్న సమయంలో తక్షకుడు గట్టున ఉన్న కుండలాలను అపహరించి నాగలోకానికి వెళ్ళాడు

అతనిని వెన్నంటి వెళ్ళిన ఉదంకుడు అతడు ఒక రంధ్రంలో దూరడం గ్రహించి తానూ  దారిలో ప్రవేశించి నాగలోకం చేరాడునాగ ప్రముఖులకు నమస్కరించి భక్తితో స్తుతిస్తూ వేయి పడగలతో భూమిని భరిస్తూ నారాయణుడికి శయ్యగా సేవలు చేస్తున్న అనంతా ! నీకు నమస్కారంసమస్త నాగలోకమును రాక్షసుల బారినుండి రక్షిస్తూ పరమశివుడి మెడలో ఆభరణంగా వెలుగొందుతున్న వాసుకికి వందనం.

సమస్త దేవతలతోనూ మానవులతోనూ పూజలందుకొంటున్న నాగదేవతలారా నన్ను అనుగ్రహించండికుమారుడైన అశ్వసేనుడితో భూలోకం అంతా సంచరిస్తున్న తక్షకా నన్ను అనుగ్రహించు అని ప్రార్ధించాడుఅప్పుడు నలుపు తెలుపు దారాలతో వస్త్రములు నేయుచున్న ఇద్దరు స్త్రీలుపన్నెండు ఆకులుగల చక్రమును తిప్పుతున్న  ఇద్దరు స్త్రీల ఆరుగురు కుమారులుమహోన్నత గుర్రం మీద ఉన్న ఒక పురుషుడు కనిపించారు దివ్యపురుషుడు అతని వద్దకు వచ్చి ఉదంకా నీ భక్తికి మెచ్చాను.

ఏమి కావాలో కోరుకో అన్నాడుఉదంకుడు  నాగలోకం నాకు వశం కావాలి అని కోరాడుఅలాగే అని వరమిచ్చిఆ దివ్యపురుషుడు గుర్రం చెవిలో ఊదమన్నాడుఉదంకుడు  గుర్రము చెవిలో ఊదాడు వెంటనే  గుర్రం చెవి నుండి భయంకర అగ్ని జ్వాలలు నాగలోకాన్ని చుట్టుముట్టాయినాగులంతా ప్రళయం వచ్చిందని తల్లడిల్లి పోయారు

తక్షకుడు భయపడి కుండలాలను ఉదంకుడికి ఇచ్చాడుఅక్కడి నుడి బయటపడే మార్గం లేక ఉదంకుడు అయోమయంలో పడగా దివ్యపురుషుడు ఉదంకా !  గుర్రాన్ని ఎక్కి నీవు కోరిన ప్రదేశానికి చేరగలవు వెంటనే ఉదంకుడు  గుర్రం మీద గురువు ఆశ్రమానికి చేరి కుడలాలను గురుపత్నికి సమర్పించాడు.


ఉదంకుడు గురుదక్షిణ సమర్పించుట :


గురువు ఉదంకునితో ఉదంకా ! సమీపంలో ఉన్న పౌష్యమహారాజు నుండి కుండలాలు తీసుకురావడానికి ఇంత సమయం ఎదుకు అయ్యింది అని అడిగాడుఉదంకుడు జరిగిన విషయాలు వివరంగా గురువుకు చెప్పాడుగురువు ఉదంకా ! నీవు ధన్యుడివిఎద్దును ఎక్కి వచ్చిన వాడు ఇంద్రుడు ఎద్దు ఐరావతంగోమయం అమృతం

అది సేవించడం వలనే నీవు అనుకునిన పని చేయగలిగావునాగలోకంలో నీవు చూసిన స్త్రీలు దాతవిధాతనలుపు తెలుపు దారాలే రాత్రి పగలుపన్నెండు ఆకులు కలిగిన చక్రం పన్నెండు మాసమపలకు ప్రతీక అయిన కాల చక్రంవారి ఆరుగురు కుమారులు ఆరు ఋతువులుగుర్రం మీద వచ్చిన దివ్యపురుషుడు ఇంద్రుడి మిత్రుడైన పర్జన్యుడుగురుపత్ని కోరిక నెరవేర్చి నీవు గురుదక్షిణ సమర్పించున్నావుఇక నీ విద్యాభ్యాసం పూర్తి అయింది అని పలికాడు.


తక్షకుని మీద ఉదంకుని ప్రతీకారం :

 

అనుకున్న కార్యం నెరవేరినా ఉదంకునికి తక్షకునిపై ప్రతీకారాగ్ని తీరలేదుఅందు కొరకు అతడు జనమేజయుని వద్దకు వెళ్ళాడుఉదంకుడు జనమేజయునితో తక్షకుడు తనకు చేసిన అపకారం గురించి చెప్పాడుజనమేజయ మహారాజా ! నీకు శుభం కలుగుగాకనా పేరు ఉదంకుడు

నేను గురువు గారి కార్యం మీద వెళ్ళిన సమయంలో తక్షకుడు కుటిల బుద్ధితో నాకు అపకారం చేసాడునాకే కాదు నీకు కూడా తక్షకుడు మహాపరాధం చేసాడుశృంగి శాపాన్ని మిషగా తీసుకుని మీ తండ్రైన పరీక్షిత్తు మహారాజును అతి క్రూరంగా కాటు వేసి తన ఘోర విషాగ్ని కీలలకు నీ తండ్రిని బలి చేసి చంపాడు.

మహా బలవంతుడైన తక్షకుడు  బ్రాహ్మణుడితో పరీక్షిత్తు మహారాజు అని నచ్చ చెప్పక అది మిషగా తీసుకుని దారుణంగా డంపాడు కదా ! నీ తండ్రిని చంపిన వాడి మీద నీవు ప్రతీకారం తీర్చుకోవడానికి నీవు వెంటనే సర్పయాగం చేసి  తక్షకుడిని యాగాగ్నిలో భస్మం చేసి నీ పగ తీర్చుకోమహారాజా ! ఒక్కడు తప్పు చేసిన అతడి కులమంతా తప్పు చేసి నట్లే కనుక ఇందులో అపరాధం ఏమీ లేదుకనుక వెంటనే మీరు సర్పయాగం చేసి నాగలోకాన్ని సమూలంగా నాశనం చేయండి అని జనమేజయుని రెచ్చకొట్టాడు.

నాగులకు కద్రువ శాపం :

 

 కథ వింటున్న శౌనకాది మునులు మహాత్మా ! నాగలోకం యాగాగ్నిలో పడి భస్మం కావడానికి వేరు కారణం ఏదైనా ఉందా ! అని అడిగారుఅందుకు సూతుడు మహామపనపలోరా ! పూర్వం కద్రువ తన కుమారులైన నాగులకు ఇచ్చిన శాపం కూడా ఇందుకు ఒక కారణంజనమేజయుడు చేయబోతున్న యాగంలో కద్రువ శాపకారణంగా సర్పకులమంతా నశిస్తున్న సమయంలో పూర్వం రూరుడు సర్పకులాన్ని అంతా నాశనం చేస్తున్న తరుణంలో సహస్రపాదుడు ఆపిన చందంగా సర్పయాగంలో పడి మరణిస్తున్న నాగులను జరత్కారుని కహమారుడైన ఆస్తీకుడు ఆపివేసాడు వృత్తాంతం వివరిస్తాను వినండి అని చెప్పాడు

భృగువు :


పూర్వం భృగువు అనే మహాముని భార్య పులోమఅతడి భార్య పేరు పులోమఆమె నిండు గర్భవతిగా ఉన్న సమయంలో భృగువు స్నానానికి వెళుతూ భార్యని హోమాగ్నిని సిద్ధం చేయమన్నాడుఅప్పుడు పులోముడు అనే రాక్షసుడు పులోమను చూసాడుఅతడికి పులోమ మీద మోహం కలిగిందిఅతడు అగ్ని దేవునితో ఆమె ఎవరని అడిగారు.

అగ్నిదేవుడు సందిగ్ధంలో పడ్డాడు పులోముడు ఒకప్పుడు పులోమను చేసుకోవాలని అనుకున్నాడుఅయితే పులోమ తండ్రి ఆమెను భృగువుకు ఇచ్చి వివాహం చేసాడుఇప్పడు నిజం చెపితే పులోముడు పులోమను ఏమి చేస్తాడో అని భయపడ్డాడుఅదీ కాక భృగువుకు కూగా తన మీద కోపం రావడంమేగాక తనను శపించవచ్చు

కాని నిజం చెప్పకుటే తనకు అసత్య దోషం అంట వచ్చుఅనగ సందిగ్ధంలో పడినా ముని శాపం ఎలాగైనా పోగొట్టుకోవచ్చుఅనుకొని అసత్య దోషానికి భయపడి ఆమె భృగువు భార్య అని నిజం చెప్పాడుఅది వినగానే పులోముడు పులోమను గుర్తు పట్టాడువివాహం కాక మునుపు ఆమెను పులోముడు చేసుకోవాలని అనుకున్నాడుకానీ ఆమెను భృగువు వివాహం చేసుకున్నాడు

 నిజం తెలిసిన రాక్షసుడు పంది రూపంలో పులోమను ఎత్తుకుని వెళ్ళాడు కుదుపులకు పులోమ గర్భంలోని శిశువు కింద పడ్డాడుకింద పడిన కారణంగా అతడికి చ్యవనుడు అన్న పేరు వచ్చిందిచ్యవనుడు కళ్ళు తెరచి చూడగానే  తేజో శక్తికి రాక్షసుడు దగ్ధం అయ్యాడు.


అగ్నిహోత్రుడి మీద భృగువు ఆగ్రహించుట :

 

తరువాత పులోమ కుమారునితో భర్త దగ్గరకు చేరింది తరుణంలో పులోమ కంటి నుండి జానువారిన కన్నీరు నదిగా మారి ప్రవహించ సాగింది నదికి బ్రహ్మదేవుడు వధూసర అని నామకరణం చేసాడునదీ స్నానానికి వెళ్ళిన భృగువు ఆశ్రమానికి తిరిగి వచ్చి తేజోవంతుడైన కుమారుడిని చూసాడుఅప్పుడు పులోమ జరిగినది భర్తకు చెప్పింది.

భృగువు భార్యతో నీవు పులోమ అని నా భార్యవు అని అతడికి ఎలా తెలిసింది అని అడిగాడుపులోమ నాధా !  అగ్నిదేవుడు నేను పులోమ అని నీ భార్యను అని చెప్పాడువరాహరూపంలో అతడు నన్ను తీసుకు పోతున్న తరుణంలో కిందకు జారిన చ్యవనుడు తీక్షణతకు రాక్షసుడు భస్మం అయ్యాడు అని చెప్పింది

అది విని భృగువు కోపించి అగ్నితో  రాక్షసుడు నా భార్యకు అపకారం చేస్తాడని తెలిసి కూడా నీవు నా భార్య గురించి చెప్పావు కనుక నీవు క్రూరుడవుఅందు వలన నీవు సర్వ భక్షకుడివి అయిపో అగ్నిదేవుని శపించాడు.


అగ్నిహోత్రుడి అలక :

 

అగ్నిదేవుడు మహర్షీ ! అసత్యం పలికిన వాడు నరకానికి పోతాడని నీకు తెలియనిదానేను అసత్య దోషానికి భయపడి అలా చెప్పానుకర్మ సాక్షిని అయిన నేను అసత్యం పలుకగలనా ! నా అపరాధం ఏమీ లేకనే నాకు నీవు శాపం ఇచ్చావునేనూ నీకు ప్రతిశాపం ఇవ్వగలను

అయినా పరుషోక్తులు పలికిలాకొట్టినాతిట్టినా ఉత్తమ బ్రాహ్మణులు పూజనీయులే ! నేను సదా బ్రాహ్మణులను పూజిస్తానుబ్రాహ్మణుల మీద కోపించడానికి భయపడతాను

 

నీవు ఉత్తమ బ్రాహ్మణుడవు కనుక నేను నిన్ను శపించనుసమస్త లోకాలకు హితము చేసే నన్ను శపించి లోకాలకు అపకారం చేసావునైమిత్తిక కార్యంలో భాగంగా అగ్నిలో వేసే హోమద్రవ్యములనుహవిస్సులను తీసుకు వెళ్ళి దేవతలకుపితరులకు ఇస్తానుఅందు వలన నన్ను హవ్యవాహనుడు అని అంటారు

నీ శాపకారణంగా నేనిక అపవిత్రుడిని ఔతాను కనుక నేనిక హవిస్సును దేవతలకుపితరులకు అందజేయలేనునేనా పని చేయకున్న లోకాలు స్థంభిస్తాయి అని చెప్పాడుఅసత్య దోషానికి భయపడి నిజం చెప్పిన తనకు వచ్చిన శాపానికి కలత చెంది అగ్ని దేవుడు సర్వ భక్షుకుడైన తాను పితృ కార్యానికిదేవ కార్యానికి పనికి రానని తన జ్వాలలను ఉపసంహరించాడు

 లోకంలో దేవక్రతువులుయజ్ఞయాగములుఔపోసనాది కార్యములు ఆగి పోయాయిదేవతార్చనలో దీపాలు ఆరిపోయాయిపితరులకు చేసే పిండ ప్రదానాలు ఆగి పోయాయిఅగ్ని కార్యాలు ఆగి పోయాయిప్రజలు హాహాకారాలు చేస్తూ మునులు వద్దకు వెళ్ళారు

వారంతా దేవతల వద్దకు వెళ్ళారుదేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారుబ్రహ్మదేవుడు అగ్నిదేవుని అనునయించి అగ్ని దేవా ! నీవు సమస్త భూతములకు నీవు యజమానివిచరాచర సృష్టికి నీవు హేతుభూతుడవుసమస్త దేవతలకు నీవు ముఖం వంటి వాడిని

 లోకోపావకుడివి అయిన నీవు ఇలా చెయ్యడం ధర్మం కాదుభృగువు వాక్కు అసత్యం కాదుసర్వభక్షకుడివి అయినా నీవు సర్వ కార్యాలలో ప్రధముడివినీవు ఎప్పటికీ పవిత్రుడవే శుచులలో నీవు శుచుడివిపూజింప తగిన వారిలో నీవు అగ్రపూజ్యుడివి.

కనుక నీ తేజమును తిరిగి ప్రజ్వలింప చేయుము బ్రాహ్మణ సహాయంతో దేవతలకు హవిస్సును అందించు అని అర్ధించాడుఅందుకు అగ్నిదేవుడు సమ్మతించాడు.


రురుడు ప్రమద్వరల వృత్తాంతం :

 

చ్యవనునికి శర్యాతి కుమార్తె నుకన్యకు వివాహమైందివారికి ప్రమతి అనే కుమారుడు ఉన్నాడుప్రమతికి క్షీరసాగర సమయంలో అమృత కలశంతో పుట్టిన ఘృతాచి అనే అప్సరసతో వివాహం అయిందిప్రమతికి ఘృతాచికి పుట్టిన కుమారుడు రురుడు

రురుడు స్థూలకేశుడు అనే ముని ఆశ్రమంలో పెరుగుతున్న ప్రమద్వరను వివాహం చేసుకోవాలని అనుకున్నాడువిశ్వావసు అనే గంధర్వ రాజుకు మేనకకు పుట్టిన కుమార్తె ప్రమద్వరఒక రోజు ప్రమద్వర పాముకాటుతో మరణించిందిప్రమద్వర మరణానికి ఆశ్రమవాసులు దుఃఖించసాగారుఅది విన్న రురుడు రోదేస్తూ అరణ్యంలోకి పరిగెతుతాడు.


ప్రమద్వరను బ్రతికించుట :

 

రురుడు శోకిస్తూ ప్రద్వరను బ్రతికించమని దేవతలను  దేవతలారా !  బ్రాహ్మణులారా ! నేను దేవ యజ్ఞములువేదాధ్యయనంవ్రతములుపుణ్యకార్యములు చేసిన వాడిని అయితేనేను నా గురువులను భక్తితో సేవించిన వాడిని అయితేనేను ఘోరమైన తపసు చేసిన వాడిని అయితే నా ప్రేయసి ప్రమద్వర మీ దయ వలన విషం నుండి విముక్త కాగలదు ప్రార్ధించాడు

తిరిగి మంత్ర తంత్రములు తెలిసిన వారు విషతత్వ శాస్త్రములు తెలిసిన వారు ఎవరైనా ప్రమద్వర విషమును హరిస్తే అతడికి నా తపః ఫలమునుఅధ్యయన ఇలమును ధారపోస్తానుఅని రోదించాడుఅప్పడు ఆకాశం నుండి ఒక దేవత బ్రాహ్మణోత్తమా !ప్రమద్వర కాలవశమున మరణిండిందిఆయుస్షు తీరింది కనుక దానిని ఆపడం ఎవరి తరం

అయినా దానికి నేను ఒక ఉపాయం చెప్తానుఎవరైనా తమ ఆయుష్షులో సగం ఇస్తే ఆమె ముదరి కంటే తేజస్సుతో బ్రతుకుతుంది అని నేను యమధర్మరాజు అనుమతితో పలుకుతున్నాను అని పలికాడురురుడు అందుకు అంగీకరించి తన ఆయుర్ధాయంలో సగం ఇచ్చి ఆమెను బ్రతికించి వివాహం చేసుకున్నాడు

సర్పముల మీద రురుడి పగ:

రురుని దర్శ్హనము వలన సర్పరూపము నుడి విముక్తుడైన సహస్రపాదుడు

కానీ రురుడికి పాముల మీద కోపం పోలేదుకర్రతో కనిపించిన పాములను చంపడం మొదలు పెట్టాడుచెట్ల వెంట పుట్టల వెంట తిరుగుతూ కనిపించిన పామపలను చంపుతూ ఉండసాగాడుఅలా చంపుతూ ఒక రోజు డుండుభం అనే ఒక పామును చంపడానికి కర్రమును పైకి ఎత్తాడు పాము భయపడి తేజోవంతుడివి అయిన బ్రాహ్మణుడివి అయిన నీవు ఇలా పాములను చంపడానికి కారణం ఏమిటి అని అడిగాడు

రురుడు నా పేరు రురుడునేను ప్రమద్వర అనే ఆమెను ప్రేమించానునేను ప్రాణప్రదంగా ప్రేమించిన ప్రమద్వరను ! పాము కాటు వేసిందిఅందు వలన నేను పాములను చంపుతున్నానునిన్ను కూడా చంపుతాను అని చెప్పి కర్రను పైకెత్తాడువెంటనే  పాము ఒక మునిగా మారి రురుడి ముందు నిలిచింది.


ఖగముని వృత్తాంతం:

 రురుడు డుండుభం అనే పాముని చంపబోతుండగా  పాము ఒక మునిగా మారాడురురుడు  పాముని ఇదేమిటి పాముగా ఉన్న నీవు మనిషిగా మారడానికి కారణం ఏమిటి  అడిగాడుఅందుకు  పాముని నేను సహస్రపాదుడు అనే మునీశ్వరుడనునా సహచరుడు ఖగముడుఒక రోజు నా సహచరుడు ఖగముడు అగ్ని కార్యం చేస్తున్నాడుఆసమయంలో నేను అతడి మీద పరిహాసంగా గడ్డితో చేసిన పాముని వేసానుఅతడు నాపై కోపించి నన్ను విషం లేని పాముగా పడి ఉండమని శపించాడు

నేను అతడిని పరిహాసానికి చేసిన పనికి నన్ను ఇలా శపిస్తావా ! నన్ను క్షమించ లేవా అని ప్రార్ధించానునా ప్రార్ధన మన్నించి ఖగముడు మిత్రమా ! నా మాట జరిగి తీరుతుందిఅయినా నీవు పాముగా పడి ఉన్న తరుణంలో రురుడు అనే భృగువంశ సంజాతుడు వస్తాడుఅతడిని చూడగానే నీకు నీ రూపం వస్తుందిఅని చెప్పాడు

అయ్యా మీరు బ్రాహ్మణులుదయాగుణం కలవారుపూర్వం నీ తండ్రి శిష్యుడైన ఆస్తికుడు కద్రువ శాప కారణంగా సర్పయాగంలో ఆహుతి అవుతున్న పాములను కాపాడాడునీవు కూడా పాములను చంపడం ఆప లేవా ! అన్నాడురురుడు పాములను చంపడం ఆపివేసాడు కథను వింటున్న మునులు తల్లి కొడుకులకు శాపం ఇవ్వడం ఏమిటిమాకు సవిస్తరంగా చెప్పండి అని కోరారు

 

సంబంధించిన సమాచారం కోసం :

ఆదిపర్వము - ప్రథమాశ్వాసము

ఆది పర్వము - ద్వితీయాశ్వాసము

ఆది పర్వము - తృతీయాశ్వాసము

ఆది పర్వము: చతుర్థాశ్వాసము

ఆది పర్వము: పంచమాశ్వాసము

ఆది పర్వము: షష్టమాశ్వాసము

ఆది పర్వము: సప్తమాశ్వాసము

ఆది పర్వము: అష్టమాశ్వాసము

Note:  ఛానెల్లోని కంటెంట్ నా స్వంతది కాదుఇది ఇంటర్నెట్ నుండి సేకరించబడింది కంటెంట్ యొక్క అసలైన రచయితలకు మరియు మూలాలకు నా గౌరవం వహిస్తున్నాను.

0 comments:

Post a Comment

Subscribe Us

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes